ప్లెబిసైట్ కావాలన్న సింధియా
- పాక్ ఉగ్రక్రీడలు మానుకోవాలి: ఎంజే అక్బర్
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో.. అక్కడ ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా బుధవారం లోక్సభలో కోరారు. భారత కిరీటమైన కశ్మీర్ను పీడీపీ-బీజేపీ ప్రభుత్వం అవమనిస్తోందన్నారు. కశ్మీర్పై చర్చ ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో శాంతి నెలకొనటంతోపాటు అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలని, ఇది కేవలం మానవత్వం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప తుపాకీ గొట్టంతో కాదన్నారు. విదేశాంగ విధానంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందన్నారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్పై జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్కు లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. విపక్షాల విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. కశ్మీర్ పరిస్థితులు సర్దుకునేందుకు అన్నిపార్టీలూ సహకరించాలన్నారు. కశ్మీర్లో ఆందోళనలకు సరైన నాయకత్వం లేదని.. అలాంటప్పుడు ఎవరితో చర్చలు జరపాలని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆడుతున్న ఉగ్రవాద క్రీడ కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, పాక్ ఆ పని మానుకోవాలని విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు.
విస్తృత స్థాయి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి: చిదంబరం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితికి కాంగ్రెస్ నేత, మాజీ హోంమంత్రి పి.చిదంబరం ఓ పరిష్కారాన్ని ప్రతిపాదించారు. కశ్మీర్ భారత్లో చేరినపుడు జరిపిన చర్చలను పునరుద్ధరించి,రాష్ట్రానికి విస్తృత స్థాయి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలన్నారు. లేదంటే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘కశ్మీర్ భారత్లో ఏ చర్చల ప్రాతిపదికన చేరిందోవిస్మరిస్తున్నాం. నమ్మకాన్ని దెబ్బతీశాం. దాని ఫలితంగాభారీ మూల్యం చెల్లించాం’ అని ఓ టీవీ చానల్తో అన్నారు. భారత రాజ్యాంగంతో విభేదించని మేరకు కశ్మీర్ సొంత చట్టాలను చేసుకోనివ్వాలన్నారు.
కశ్మీర్పై వాడివేడి చర్చ
Published Thu, Jul 21 2016 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement