ముంబై పేలుళ్ల కేసుతో ముడిపెట్టకండి: సంజయ్ దత్
♦ 23 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎరవాడ జైలునుంచి విడుదల
♦ పూర్తి స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్య
సాక్షి, పుణే/ ముంబై: ‘నేను ఉగ్రవాదిని కాను. నన్ను ముంబై బాంబు పేలుళ్ల ఘటనతో ముడిపెట్టకండి. అక్రమంగా ఆయుధాలున్నందుకే జైలుశిక్ష అనుభవించాను’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలిపారు. ముంబైలో బాంబు పేలుళ్ల కేసులో శిక్షాకాలం పూర్తి చేసుకున్న సంజయ్ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 56 ఏళ్ల సంజయ్ చిరునవ్వుతో బయటకొచ్చి జైలుపైన ఎగురుతున్న జాతీయ జెండాకు శాల్యూట్ చేసి, తర్వాత భూమిని ముద్దాడారు. తర్వాత భార్య మాన్యత, నిర్మాత-స్నేహితుడు రాజ్కుమార్ హిరాణీలతో కలసి పుణే విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు.
వెల్కమ్ సంజూ బాబా!
ముంబై ఎయిర్పోర్టు నుంచి సిద్ధివినాయకుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తర్వాత తన తల్లి నర్గీస్ సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత బాంద్రాలోని నివాసానికి చేరుకున్న సంజయ్కు పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. మహేశ్ భట్, సుభాష్ ఘాయ్, జుహీ చావ్లా, గ్రేసీ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంజయ్కు అభినందనలు తెలిపారు.
రాత్రంతా నిద్రలేదు: 23 ఏళ్ల నుంచి చేస్తున్న నిరీక్షణ తర్వాత ఇప్పడు పూర్తి స్వాతంత్య్రం లభించిందని సంజయ్ వ్యాఖ్యానించారు. కుట్ర కేసులో టాడా కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తు చేశారు. తనకు దేశమంటే గౌరవం ఉన్నందు నే సుప్రీం తీర్పును శిరసావహించానన్నారు. జైలులో పనిచేసినందుకుగాను లభించిన రూ. 440లను భార్యకు ఇచ్చానన్నారు. విడుదలవుతున్న ఆనందంతో రాత్రంతా నిద్రపోలేదని.. మూడునాలుగు రోజులుగా భోజనం చేయలేదని ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు ఎంతో ఉద్వేగభరితమైందని సంజ య్ సోదరి ప్రియాదత్ అన్నారు.
అంతా నిబంధనల ప్రకారమే..
దత్కు వీఐపీ మర్యాదలు చేసి ముందుగానే విడుదల చేశారంటూ జైలు వద్ద పలువురు నిరసనకారులు ఆందోళనకు దిగారు. సంజ య్కు పెరోల్, 144 రోజుల రెమిషన్ అన్నీ.. జైలు నిబంధనల ప్రకారమే జరిగాయని జైలు అధికారులు, దత్ లాయర్లు స్పష్టంచేశారు. కాగా, రెమిషన్పై దత్ను విడుదల చేయడా న్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్పై విచారణను ముంబైహైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.
నేను ఉగ్రవాదిని కాను
Published Fri, Feb 26 2016 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement