ముంబై: ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియంకా చతుర్వేది ఆరోపించారు. మహిళలకు భద్రత కల్పించడంలో నరేంద్ర మోదీ సర్కారు విఫలమైందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయని, వీటిని నివారించేందుకు సరైన చట్టాలు లేవని వాపోయారు. సామాజిక మాధ్యమాల్లో మగువలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి రాసిన వ్యాసంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తనకు కూడా బెదిరింపులు వచ్చాయని ప్రియంక వెల్లడించారు. నిర్భయ తరహాలో రేప్ చేసి చంపుతామని ట్విటర్ లో తనను హెచ్చరించారని చెప్పారు. ప్రముఖ నాయకురాలైన తనకే ఇలాంటి బెదిరింపులు వస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ తనకు ఉందని స్పష్టం చేశారు. హిందూ సంస్థలకు చెందిన మద్దతుదారులు తనను బెదిరించారని, ఇలాంటి హెచ్చరికలను తాను లెక్కచేయబోనని చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపులను గురించి మళ్లీమళ్లీ మాట్లాడుతూనే ఉంటానన్నారు. తనను బెదిరించిన వాళ్లు బెయిల్ పై విడుదలైనా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.
తనను భయపెట్టిన వ్యక్తిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ఎంతో సహకరించారని చెప్పారు. తనకు బెదిరింపులు కొత్త కాదని, పోలీసులను ఆశ్రయించడం మొదటిసారి కాదని గుర్తు చేశారు. ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు పటిష్టమైన చట్టాలు రూపొందించాలని ఆమె కోరారు. బీజేపీ నాయకులు మాటలు కట్టిపెట్టి మహిళా భద్రతపై దృష్టి సారించారని సలహాయిచ్చారు. సైబర్ వేధింపులు నివారించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల రక్షణపై ప్రభుత్వ చిత్తశుద్ధికి జైట్లీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.
'నిర్భయ తరహాలో రేప్ చేస్తామన్నారు'
Published Mon, May 23 2016 8:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement