మెట్రోలతోపాటు గ్రామీణ ప్రాంతాల చిరునామాలూ లభ్యం
* తొలి జాబితాపై కొనసాగుతున్న విచారణ
న్యూఢిల్లీ: పనామా పేపర్ల లీకేజీతో గత నెలలో సంచలనం సృష్టించిన ఇంటర్నేషన్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఇందులో దాదాపు 2వేల మంది భారతీయుల పేర్లున్నట్లు తెలిసింది. ఐసీఐజే పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం.. కొత్త జాబితాలో భారతీయులకు సంబంధమున్న 22 విదేశీ కంపెనీలు, 1,046 మంది అధికారులు లేదా వ్యాపారులు, సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారంతో పాటు 42 మంది మధ్యవర్తులు 828 చిరునామాలు వెల్లడైనట్లు సమాచారం.
వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్కతా,చెన్నై వంటి మెట్రో నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలైన హరియాణాలోని సిర్సా, బిహార్లోని ముజఫర్పూర్, మధ్యప్రదేశ్లోని మాంద్సౌర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న చిన్న పట్టణాలనుంచి కూడా చిరునామాలున్నట్లు తెలిసింది. ఐసీఐజే మంగళవారం హాంకాంగ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, నెవడాతోపాటు 21 దేశాల్లో చోట్ల ఉన్న పలు కంపెనీల వివరాలను వెల్లడించింది. పనామాలోని న్యాయ సలహా సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి సేకరించిన సమాచారంలో కొన్ని కంపెనీలు, ట్రస్టులు విదేశీ కంపెనీల పేరును న్యాయబద్ధంగానే వాడుకుంటున్నట్లు వెల్లడైందని ఐసీఐజే తెలిపింది.
గత నెల సంచలనం సృష్టించిన ఈ పేపర్స్ లీక్ తొలి జాబితాలో 500 మంది పేర్లు వెల్లడవటంతో.. వీటిపై విచారణకు ఆర్బీఐ, ఆదాయపు పన్ను శాఖ, ఎఫ్ఐయూ, విదేశీ పన్ను విశ్లేషణ సంస్థల అధికారులతో భారత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
జాబితాలో 259 మంది పాకిస్తానీలు..
తాజా జాబితాలో పాకిస్తాన్ అధికారులు, సినీ దర్శకుడు ఒబైద్ చినోయ్ తల్లితోపాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లున్నాయి. ఇందులో చాంబర్ ఆఫ్ కామర్స్, పోర్టు ట్రస్టుల అధ్యక్షులు పేర్లు కూడా వెల్లడయ్యాయి. అయితే ఇందులో రాజకీయ నాయకుల పేర్లేమీ లేవని తెలిసింది. కాగా, తన తల్లిపేరుతో ఉన్న విదేశీ కంపెనీలు చట్టబద్ధంగానే రిజిస్టర్ అయ్యాయని ఒబైద్ వెల్లడించారు.
తాజా ‘పనామా’లో మనోళ్లు 2వేలు
Published Wed, May 11 2016 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement