బాంబే ఐఐటీకి భారీగా నిధులు | Sakshi
Sakshi News home page

బాంబే ఐఐటీకి భారీగా నిధులు

Published Tue, Jul 5 2016 6:40 PM

బాంబే ఐఐటీకి భారీగా నిధులు

ముంబై: ‘సోలార్ ఊర్జా ల్యాంప్’ (ఎస్‌ఓయూఎల్) పథకం కింద బాంబే ఐఐటీకి కేంద్రం రూ.1,800 కోట్లు మంజూరు చేయనున్నట్లు విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. ఈ డబ్బుతో బాంబే ఐఐటీ దేశంలోని 10 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు సౌర దీపాలను అందిస్తుంది.

10 లక్షల మంది విద్యార్థులకు దీపాలను అందించాలని ఈ పథకం ప్రారంభించారు. ఇప్పుడు బాంబే ఐఐటీ సహాయంతో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచుతున్నారు. దేశంలోని ప్రతి పాఠశాల విద్యార్థికి చదువుకునేందుకు అందుబాటు ధరల్లో స్పష్టమైన వెలుగునిచ్చే సౌరదీపాలను అందించాలని ఈ పథకం లక్ష్యం.

Advertisement
Advertisement