ఆ రైలు బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే హైట్! | Sakshi
Sakshi News home page

ఆ రైలు బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే హైట్!

Published Mon, Dec 21 2015 1:20 PM

ఆ రైలు బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే హైట్!

జమ్మూకశ్మీర్: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేగా పేరున్న ఇండియన్ రైల్వే జమ్మూకశ్మీర్లో భారీ ప్రాజెక్టును చేపట్టింది. చీనాబ్ నదిపై నిర్మించనున్న రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన కానుంది. 1,315 మీటర్ల పొడవు కలిగి ఉండి 359 మీటర్ల ఎత్తుతో రైలు బ్రిడ్జ్  నిర్మించబడుతోంది. 324 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ మరో 35 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం. ఈ వంతెన నిర్మాణానికి 480 మీటర్ల ఆర్చ్ను వాడుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement