సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అస్సాం, బీహార్ రాష్ట్రాలను ఇటీవల వరదలు ముంచెత్తడం, అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడానికి చైనానే కారణమా? చైనా, భారత దేశాల మధ్య 2013లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఎగువన చైనా భూభాగంలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర న దీ జలాలకు సంబంధించిన గణాంకాలను భారత్కు విధిగా తెలియజేయాలి. 2016, జూన్ నెలలోనే ఈ గణాంకాలను చైనా ప్రభుత్వం నిలిపివేసింది.
బ్రహ్మపుత్ర నదీ గణాంకాలను తెలియజేయాల్సిందిగా భారత ప్రభుత్వం కోరగా, టిబెట్లోని తమ జలాల సంబంధిత స్టేసన్ను ఆధునికరిస్తున్నామని, ఈ కారణంగా తమ వద్ద నదీ జలాల గణాంకాలు అందుబాటులో లేవని చైనా ప్రభుత్వం తెలియజేసిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ తెలిపారు. ఈ వివరాలు తమకు అంది ఉన్నట్లయితే అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ముందే వరదల ముప్పును ఊహించే వారమని, నష్ట నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల డోక్లామ్లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన సైనిక ప్రతిష్టంభనకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చారు.
స్టేషన్ ఆధునీకరణ పేరిట బ్రహ్మపుత్రా నదీ గణాంకాలను మనకు ఇవ్వని చైనా ప్రభుత్వం, పొరుగునున్న బంగ్లాదేశ్కు మాత్రం యథాతధంగా ఇస్తున్నట్లు బంగ్లాదేశ్ సంయుక్త జలాల కమిషన్ సభ్యుడు మొఫాజల్ హొస్సేన్ తెలిపారు. బ్రహ్మపుత్ర నీటి మట్టం వివరాలను మొన్నంటే మొన్న కూడా తమకు చైనా నుంచి అందాయని ఆయన చెప్పారు. 2002 సంవత్సరం నుంచి టిబెట్లోని మూడు చైనా జల సంబంధిత స్టేషన్ల నుంచి క్రమం తప్పకుండా తమకు డేటా అందుతోందని ఆయన తెలిపారు. ఈ విషయాలను చైనా విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిథి జెంగ్ షూహాంగ్ కూడా ధ్రువీకరించారు. మరి భారత్కు ఎందుకు వివరాలు అందజేయడం లేదో చైనా నుంచి స్పష్టత లేదు.
చైనా కారణంగానే భారత్కు వరదలు.. ఎలా?
Published Mon, Sep 18 2017 6:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement