న్యూఢిల్లీ: ఇతరుల అభిప్రాయాలతో విభేదిస్తున్నా, వారి గౌరవం, హుందాతనాన్ని అపహాస్యం చేయరాదని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. పౌరుల సంక్షేమానికి పాటుపడే సమాజ నిర్మాణం జరగాలని పిలుపునిచ్చారు. పదవుల్లో ఉన్న వ్యక్తుల కన్నా వ్యవస్థలే ముఖ్యమైనవని, అవి క్రమశిక్షణ, నీతి నిజాయతీలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు. పేదరికాన్ని సాధ్యమైనంత తొందరగా తరిమికొట్టడం మన పవిత్ర కర్తవ్యమని ఉద్బోధించారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతిగా కోవింద్ తొలిసారి గురువారం సాయంత్రం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చారిత్రక సంబంధ విషయాల్లోనూ ఇతరులతో విభేదిస్తే తప్పేం లేదనీ కానీ, వారి గౌరవాన్ని కించపరచకూడదని అన్నారు. చరిత్రను వక్రీకరించి తీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మావత్ చిత్రానికి వ్యతిరేకంగా కొన్ని హిందూ అతివాద సంస్థలు హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో కోవింద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
వ్యక్తి కాదు...వ్యవస్థే ముఖ్యం..
పట్టణాలైనా, గ్రామాలైనా పౌర స్పృహ కలిగి ఉన్న పౌరులతోనే పౌరస్పృహ ఉన్న జాతి నిర్మితమవుతుంది. పండగ జరుపుకుంటున్న సమయంలో, నిరసన తెలుపుతున్నప్పుడు పొరుగువారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. ఏదైనా విషయంలో ఇతరులతో అభిప్రాయభేదాలు ఏర్పడొచ్చు. చారిత్రక విషయాలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. సాటి వ్యవస్థ, సంస్థలతో సంబంధాలను గౌరవించుకుంటూ అన్ని సంస్థలు ముందుకు సాగాలి. నాణ్యత, పనితీరు విషయంలో రాజీపడకుండా సొంత పరిధిని అతిక్రమించకుండానే అవి పనిచేయాలి.
పేదరిక నిర్మూలన పవిత్ర బాధ్యత..
మనం గణతంత్ర రాజ్యాన్ని నిర్మించిన నాయకుల స్ఫూర్తితో కష్టపడాలి. పేదలు, అణగారిన వర్గాల కనీస అవసరాలు తీర్చలేనప్పుడు మనం సంతృప్తి చెందలేం. తక్కువ కాలంలో పేదరికాన్ని అంతమొందించడం మనందరి పవిత్ర బాధ్యత . ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే కల సమీపంలోనే కనిపిస్తున్నా జాతి నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక కొత్త దశ మాత్రమే. దీన్ని యువతే తమ దార్శనికత, ఆశయాలతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మన విద్యా వ్యవస్థ 21 శతాబ్దానికి అనుగుణంగా డిజిటల్ ఎకానమీ, జినోమిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్లను ఆకళింపు చేసుకునేలా సంస్కరణలు రావాలి.
విభేదాలతో అపహాస్యం చేయొద్దు
Published Thu, Jan 25 2018 8:17 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● సాయంత్రం నుంచి రథాలకు బ్రేక్.. మూగబోనున్న మైక్లు ● మద్యం దుకాణాలకూ సీల్ ● చివరిరోజుపై పార్టీల ఫోకస్
బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
No Headline
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
మోదీని మూడోసారి ప్రధాని చేయాలి
బీజేపీకి ఓటమి భయం
క్లుప్తంగా
గాలివాన బీభత్సం
కల్యాణం.. కమనీయం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement