సాక్షి, అమరావతి: భారత్లో ఉన్న అమెరికన్లు ఇప్పుడు తమ దేశం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కరోనా మహమ్మారిని అమెరికా కంటే భారతదేశమే సమర్థంగా కట్టడి చేస్తోందని వాళ్లు భావిస్తుండటమే దీనికి కారణం. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తామంటూ ఆ దేశ ప్రతినిధులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా సరే.. వీళ్లు అందుబాటులోకి రావడం లేదు. స్వయానా అమెరికా ప్రిన్సిపుల్ డిప్యూటీ సెక్రటరీ ఇయాన్ బ్రౌన్లీనే ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
► వ్యాపార, ఉద్యోగావసరాలతో పాటు పర్యాటకులుగా దాదాపు 10 వేల మంది అమెరికన్లు భారతదేశానికి వచ్చారు.
► కరోనా వైరస్ ప్రబలడంతో భారతదేశం లాక్డౌన్ ప్రకటించి.. అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేయడంతో వీరు ఇక్కడే చిక్కుకుపోయారు.
► దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ వారు ఆందోళన చెంది.. తమను ప్రత్యేక విమానాల్లో అమెరికా తీసుకెళ్లాలని ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి ఈ–మెయిల్స్ పంపించి పేర్లు నమోదు చేసుకున్నారు.
► ప్రత్యేక విమానాల ద్వారా వీరందరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది.
► మొదటి విడతలో నాలుగు వేల మంది అమెరికన్లను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి ఈ నెల రెండోవారంలో ప్రత్యేక విమానాల్లో అమెరికా తీసుకెళ్లారు.
► మిగిలిన ఆరు వేల మంది అమెరికన్లను తీసుకెళ్లేందుకు ఆ దేశ ప్రతినిధులు వీరి కోసం ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రాకుండా.. కొంతకాలం భారత్లోనే ఉంటామని పరోక్షంగా చెబుతున్నారు.
► అమెరికాలో కరోనా కేసులు 10 లక్షలు దాటగా.. 58 వేల మందికి పైగా మరణించారు.
► కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని వారు భావిస్తున్నారు. మరోవైపు భారత్లో కరోనా కేసులు 31 వేలే ఉన్నాయి.
ఇండియానే సేఫ్.. అమెరికాకు వెళ్లం!
Published Thu, Apr 30 2020 4:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement