► ఒక్క నెలలోనే 242 మంది అరెస్ట్
► పట్టుబడిన వారిలో దేశీయులే అధికం
► విద్య, వ్యాపారం పేరుతో ఆఫ్రికా వాసుల డ్రగ్స్ రవాణా
సాక్షి, బెంగళూరు : దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన బెంగళూరు మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోతోంది. ఒక్క మే నెలలోనే 242 మంది డ్రగ్స్ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన వారిలో విదేశీలయులతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకు డ్రగ్స్ రవాణా చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. డ్రగ్స్ రవాణాపై బెంగళూరు సీసీబీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్క మేనెలలోనే 161 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు 187 మంది భారతీయులతో పాటు 55 మంది విదేశీయులు ఉన్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువగా ఆఫ్రికన్లు ఉన్నారని నగర పోలీసు అదనపు కమిషనర్ రవి తెలిపారు.
గంజాయికి మొదటి స్థానం
పట్టుబడిన వాటిలో గంజాయిదే అగ్రస్థానం. ఆ తరువాత కొకైన్, ఎంఫెటమైన, మలేషియా నుంచి వచ్చే యాబా ట్యాబ్లెట్లు ఎక్కువగా స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ పోలీసులు చెబుతున్నారు. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ల నుంచి రైళ్ల ద్వారా బెంగళూరుకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక కొకైన్, ఇతర మత్తు పదార్థాలు ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్ దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు.
ఉండలుగా మింగి...
ఆఫ్రిక, యుగాండా, నైజీరియా దేశాలకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లు మాదక ద్రవ్యాలను రవాణా సమయంలో అత్యంత పకడ్భందీగా వ్యవహరిస్తారు. ఎవరికి అనుమానం రాకుండా మత్తు పదార్థాలను ఉండలుగా మింగుతారు. ఏయిర్ పోర్టు లలో కూడా బాడీ స్కానింగ్ యంత్రాలు వీటిని గుర్తించడం ఎంతో కష్టం. దీంతో స్మగ్లర్లు సులభంగా తప్పించుకుంటున్నారు. మలేషియా, హాంకాంగ్ నుంచి వచ్చే వారు రూ. లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పలు రకాలుగా శరీరంలోనే ఇనుమడింప చేసుకుని రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో బెంగళూరు పోలీసులు వీరిపై పెద్ద ఎత్తున నిఘా పెడుతున్నారు. పట్టుబడితే అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. ఇందులో నైజీరియన్లు ఎక్కువగా ఉన్నారని, వీరు విద్య, వ్యాపారం నిమిత్తం బెంగళూరు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ రవి తెలిపారు.
సంవత్సరం 2017 మే 2016 మే
కేసులు 135 128
అరెస్ట్ అయిన వారు 242 285
విదేశియులు 55 22
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ 161 కిలోలు 276 కిలోలు
మాదక ద్రవ్యాల అడ్డా బెంగళూరు
Published Sun, Jun 4 2017 3:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement