హైకోర్టు తీర్పుపై సుప్రీంలో కర్ణాటక అప్పీలు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జయతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇలవరసి తదితరులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున జోసెఫ్ అరిస్టాటిల్ అనే న్యాయవాది అప్పీలు దాఖలు చేశారు. జయ ఆదాయానికి మించిన ఆస్తుల విలువను అంచనావేయడంలో, లెక్కించడంలో హైకోర్టు పొరపాటుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. వాస్తవంగా ఆమె రుణాల విలువను రూ.10.67 కోట్లుగా లెక్కించాల్సి ఉండగా, రూ.24 కోట్లుగా లెక్కించారని చెప్పారు.
దీంతో ఆదాయానికి మించి ఉన్న ఆస్తులశాతం చాలా తక్కువగా 8.12 శాతంగా మాత్రమే తేలిందని.. కానీ ఈ అదనపు ఆస్తుల విలువ 76.7 శాతం కంటే ఎక్కువేనని పిటిషన్లో పేర్కొన్నారు. అంటే ఆమె ఆదాయానికి అనుగుణంగా ఉండాల్సిన ఆస్తి రూ.21.26 కోట్లు కాగా, అంతకు మించి రూ.16.32కోట్లు అదనంగా ఉన్నట్లు లెక్కతేలుతుందని వివరించారు. అంతేగాకుండా కర్ణాటకను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఈ కేసు విచారణ సమయంలో జయ తమిళనాడు సీఎంగా ఉండడంతో దర్యాప్తుపై ప్రభావం పడిందన్నారు. అందువల్ల జయ తదితరులను నిర్దోషులుగా విడుదలచేస్తూ కర్టాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల్సిందిగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. అప్పీలుపై తమిళనాడులోని డీఎంకే తదితర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.
జయ నిర్దోషిత్వంపై స్టే ఇవ్వండి
Published Wed, Jun 24 2015 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement