జెఎన్యూలో మరో కలకలం | Sakshi
Sakshi News home page

జెఎన్యూలో మరో కలకలం

Published Thu, Mar 10 2016 1:51 PM

జెఎన్యూలో మరో కలకలం - Sakshi

న్యూఢిల్లీ:   ఢిల్లీ జెఎన్యూ లో మరోసారి కలకలం చెలరేగింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడ్ని ఉత్తరప్రదేశ్ లోని  బరేలీకి చెందిన  దుష్యంత్ గా  గుర్తించారు.  సూసైడ్  నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది.

చనిపోయిన విద్యార్థి పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన పోలీసులు వ్యక్తిగత కారణాల వల్లే  ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.  కాగా విద్యార్థి క్యాంపస్ ఆవరణలో చనిపోలేదని, దక్షిణ ఢిల్లీలో అద్దెగదిలో ఉరివేసుకున్నాడని తెలిపారు.

 

Advertisement
Advertisement