పట్నా సీజేగా జస్టిస్ నరసింహారెడ్డి | Sakshi
Sakshi News home page

పట్నా సీజేగా జస్టిస్ నరసింహారెడ్డి

Published Sat, Jan 3 2015 2:59 AM

పట్నా సీజేగా జస్టిస్ నరసింహారెడ్డి

  • ప్రమాణం చేయించిన గవర్నర్ త్రిపాఠి
  • పట్నా: పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారమిక్కడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీనాథ్ త్రిపాఠి ఆయనతో ప్రమాణం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మంఝీ, బిహార్ శాసన మండలి చైర్మన్ అవధేశ్ నారాయణ్ సింగ్, అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరీ, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డిని పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే.
     

Advertisement
Advertisement