సీజేగా జస్టిస్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

సీజేగా జస్టిస్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం

Published Thu, Dec 3 2015 11:27 AM

Justice Thakur sworn in as Chief Justice of India

భారత సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హెచ్.ఎల్. దత్తు డిసెంబర్ 2వ తేదీన పదవీ విరమణ చేశారు. కొత్త సీజేగా వచ్చిన జస్టిస్ ఠాకూర్ 2017 జనవరి 3వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే, ఆయనకు 13 నెలల పదవీ కాలం మిగిలి ఉంటుంది.

Advertisement
 
Advertisement