సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు విషయంపై మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆదివారం చెన్నైలోని అన్నా అరివాళయంలో డీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా పలు తీర్మానాలు చేశారు. కొందరు నాయకులు కాంగ్రెస్తో చేయి కలుపుదామని సూచించగా, మరి కొందరు బీజేపీతో కలసి పయనిద్దామని సలహా ఇచ్చారు. ఇంకొందరు ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి సత్తా చాటుదామన్నారు. చివరగా, పొత్తులకు సంబంధించిన పూర్తి నిర్ణయాధికారాలను పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్బళగన్లకు అప్పగిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం కరుణానిధి మీడియూతో మాట్లాడారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు, అలాంటి పరిస్థితే లేదని, తమను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని చెప్పారు. అరుుతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా, అది వాజపేరుుతోనే ముగిసిన అధ్యాయమని పేర్కొంటూ, ఎన్నికల పొత్తులు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ వేశామని అందులో తుది నిర్ణయం తీసుకుంటామని కరుణానిధి పేర్కొన్నారు. సమావేశంలో 2జీ స్పెక్ట్రం కేసును గుర్తు చేస్తూ.. కాంగ్రెస్తో పొత్తు ప్రతిపాదనను కరుణానిధి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ కుంభకోణంలో పార్టీ నేత రాజాతో పాటు డీఎంకే కూడా అవమానాల పాలైందన్నారని వెల్లడించాయి. ఆ కేసుకు సంబంధించి కరుణానిధి కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాలు జైలు పాలైన విషయాన్ని కూడా కరుణానిధి ప్రస్తావించారని చెప్పాయి. శ్రీలంక తమిళుల సమస్యపై విభేదాలతో ఈ మార్చిలో డీఎంకే కాంగ్రెస్కు దూరమైంది. తాజా నిర్ణయం డీఎంకేకు కాకుండా, అన్నాడీఎంకేకు ఎక్కువగా లాభిస్తుందని ఒక నేత అభిప్రాయపడ్డారు. కాగా డీఎంకే నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించలేదు. ‘పొత్తులపై ఏర్పాటైన ఆంటోనీ కమిటీకి మాత్రమే ఈ విషయంపై వాఖ్యానించే హక్కు ఉంది’ అని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు.
కాంగ్రెస్తో పొత్తుండదు: కరుణానిధి
Published Mon, Dec 16 2013 4:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement