రెండు నెలలుగా బాలికకు పన్నెండుమంది నరకం | Sakshi
Sakshi News home page

రెండు నెలలుగా బాలికకు పన్నెండుమంది నరకం

Published Tue, Apr 5 2016 6:53 PM

Kerala: Minor Dalit girl tortured, raped by 12 men for two months; Police arrests 7 accused

తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలికపై పన్నెండు మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు నెలలుగా ఆ బాలికకు నరకం చూపించారు. ఈ దాడికి పాల్పడినవారిలో ఏడుగురును పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం తిరువనంతపురం జిల్లాకు సరిహద్దులో ఉన్న అత్తింగర్ అనే ప్రాంతంలో ఓ పదిహేనేళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది.

మానసిక వికలాంగురాలైన తన తల్లి, వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఉంటోంది. ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసుకున్న ఆ బాలిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోంది. కుటుంబ కష్టాల్లో ఉన్న కారణంగా పోషణ నిమిత్తం సినిమాటిక్ డ్యాన్సర్ గా కూడా పనిచేస్తోంది. అయితే, గత ఫిబ్రవరి 2న ఆమె సోదరుడి ఇద్దరు స్నేహితులు అమిర్, అనుప్ షా తమ ఆటో రిక్షాలో తీసుకెళ్లి ఓ ఏడారి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వరుసగా రెండు నెలలపాటు ఆ బాలికపై పన్నెండుమంది ప్రతిరోజు లైంగిక దాడి చేస్తూ నరకం చూపించారు. చివరకు పోలీసులకు ఈ విషయం తెలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement