హడ్కో పురస్కారాన్ని అందుకున్న మంత్రి కేటీఆర్ | Sakshi
Sakshi News home page

హడ్కో పురస్కారాన్ని అందుకున్న మంత్రి కేటీఆర్

Published Mon, Apr 25 2016 1:54 PM

హడ్కో పురస్కారాన్ని అందుకున్న మంత్రి కేటీఆర్

ఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి ప్రకటించిన హడ్కో అవార్డును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. మౌలిక వసతుల రంగంలో సాధించిన ప్రగతికిగానూ  హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డుకు ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు అభించింది.

హడ్కో 46వ వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి కేటీఆర్‌కు అవార్డును బహుకరించారు.
 

Advertisement
Advertisement