సుకుమా జిల్లాలో మందుపాతర పేలుడు | Sakshi
Sakshi News home page

సుకుమా జిల్లాలో మందుపాతర పేలుడు

Published Mon, Feb 27 2017 1:45 PM

landmine blast in sukuma district

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోల కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయి. ఆదివారం రాత్రి గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ రోంపల్లి కలప డిపోకు నిప్పుపెట్టిన మావోలు.. సోమవారం సుకుమా జిల్లాలోని కుంట సమీపంలో జాతీయ రహదారిపై మందు పాతర పేల్చారు. దీంతో 30 వ నెంబర్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. అలాగే మద్దేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పొగడపల్లి దగ్గర రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న జేసీబీ, టిప్పర్‌లను మావోలు తగలబెట్టారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement