బస్సుల్లో వెళ్లేటప్పుడు గానీ, ఏవైనా సరుకులు, మందుల కొనుగోలు సమయంలో గానీ ఒక్క రూపాయే కదా అని మనం వదిలేస్తాం. అవతలివాళ్లు చిల్లర ఇవ్వాల్సి ఉండి, లేదన్నా కూడా పెద్దగా పట్టించుకోం. కానీ, బిల్లులో చెప్పిన మొత్తం కంటే ఒక రూపాయి ఎక్కువగా తీసుకున్నారన్న కారణంగా ఓ లాయర్ గారు హోటల్ను కోర్టుకు లాగారు. రూ. 1100 పరిహారం కూడా పొందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వాసుదేవ్ అడిగకు చెందిన ఫాస్ట్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ హోటల్కు టి. నర్సింహమూర్తి అనే లాయర్ వెళ్లారు. అక్కడ ఒక ప్లేటు ఇడ్లీలు తిన్నారు. వాటి ఖారీదు రూ. 24 అయితే.. హోటల్ వాళ్లు మాత్రం ఆయన దగ్గర రూ. 25 తీసుకున్నారు.
దాంతో తన వద్ద నుంచి అన్యాయంగా, అక్రమంగా రూపాయి తీసుకున్నారంటూ ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయింఆచరు. ఈ లెక్కన హోటల్కు రోజకు ఎంత మంది వస్తారు, వాళ్లందరి దగ్గర నుంచి రూపాయి చొప్పునప అదనంగా ఈ హోటల్ ఎంత తీసుకుంటోందన్న లెక్కలు కూడా వివరించారు. అయితే, తాము చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఆ రూపాయి తీసుకుంటున్నట్లు హోటల్ యాజమాన్యం వాదించినా.. ఫోరం మాత్రం దాంతో ఏకీభవించలేదు. అదనంగా వసూలు చేసినందుకు వంద రూపాయల నష్ట పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. మెనూ కార్డు మీదే ప్లేటు ఇడ్లీ ఖరీదు రూ. 25 అని చెప్పి ఉంటే తాను కచ్చితంగా చెల్లించేవాడినని, అక్కడ మాత్రం తక్కువ పెట్టి ఇక్కడ ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని లాయర్ నర్సిహమూర్తి ప్రశ్నించారు.
హైకోర్టుకు వెళ్లినా..
వినియోగదారుల ఫోరం 2014లో ఈ ఆదేశాలిచ్చింది. దాన్ని సవాలుచేస్తూ సదరు హోటల్ చైన్ వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా వాళ్లకు చుక్కెదురే అయ్యింది. హైకోర్టు హోటల్ వాళ్ల పిటిషన్ను డిస్మిస్ చేసింది. దిగువ కోర్టు ఇచ్చి ఆదేశాలను సమర్థించింది.
ఒక్క రూపాయి.. ఎంత పని చేసింది!
Published Mon, Sep 26 2016 8:10 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement