అన్ని పార్టీల సహకారానికి అఖిలపక్ష భేటీలో వెంకయ్య పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సగటు మనిషికి అవసరమైన అన్ని అంశాలపై తగిన విధంగా చర్చ జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీల నేతల సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తమిళనాడుకు చెందిన మత్స్యకారుల సమస్యలు, నదుల అనుసంధానం, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల రిజర్వేషన్ బిల్లు, రైల్వే చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మహిళలపై దాడులు, ఆంధ్రప్రదేశ్ విభజన తదితర అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పాల్గొన్నారు. జేడీఎస్ నేత దేవెగౌడ, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వైఎస్సార్సీపీ నుంచి మేకపాటి రాజమోహన్రెడ్డి, టీడీపీ నుంచి దేవేందర్గౌడ్, నరసింహం, టీఆర్ఎస్ నుంచి కేకే, ఎ.పి.జితేందర్రెడ్డి, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు కూడా హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని మోడీ వివిధ పార్టీల నేతలతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు.
యూపీఏ నిర్వాకం వల్లే ధరల పెరుగుదల..
దేశంలో విపరీతంగా పెరుగుతున్న ధరలకు గత యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణం కావొచ్చని వెంకయ్యనాయుడు అన్నారు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లోక్సభ స్పీకర్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్ నేత కమల్నాథ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... పార్టీలకు అతీతమైన స్పీకర్పై ఆరోపణలు చేయడం దురదృష్టమన్నారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తాం: అరుణ్ జైట్లీ
చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ.. ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ఆహారోత్పత్తుల నిల్వలు సరిపోను ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూపీఏ విధానాల వల్లనే ధరలు విజృంభించాయన్నారు.
ఏ చర్చకైనా సిద్ధమే: వెంకయ్య నాయుడు
Published Tue, Jul 8 2014 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement