సాక్షి, ముంబై: బీజేపీ-శివసేన పార్టీలు తాము చేసుకొన్న ఒప్పందాలనే ఉల్లఘిస్తున్నాయి. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ మధ్య అప్పట్లో కుదుర్చుకున్న ‘ఇంటర్ ట్రేడింగ్’ వద్దు అనే ఒప్పందాన్ని ఇప్పటి నాయకులు పాటించడం లేదు. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కిరాకపోవడంతో వివాదం ముదురుతోంది. దీనికి తోడు శివసేన నుంచి బయటపడిన నాయకులను, కార్యకర్తలను బీజేపీ అక్కున చేర్చుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరే సూచనలు ఉన్నాయి.
ఇరు పార్టీల నుంచి బయటపడిన వారిని చేర్చుకోవద్దనే అంశంపై దివంగత నేతల మధ్య లిఖిత పూర్వకంగా ఒప్పందం జరిగింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా బీజేపీలో అసంతృప్తికి గురైన తర్వాత పార్టీ నుంచి బయట పడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో బాల్ ఠాక్రేతో భేటీ అయి తాను శివసేనలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ వెంటనే మహాజన్ ఠాక్రేతో భేటీ అయి ‘ఇంటర్ ట్రేడింగ్’ వద్దు అని విజ్ఞప్తి చేశారు. దీంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఠాక్రే నిక్కచ్చితంగా పాటించారు.
తిలోదకాలు
కానీ ఇప్పటి నాయకులు ఇంటర్ ట్రేడింగ్ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నాసిక్ జిల్లా నిఫాడ్ తాలూకాకు చెందిన కొందరు శివసేన పదాధికారులు, 200 మంది కార్యకర్తలను బీజేపీలో చేర్చుకున్నారు. బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే సమక్షంలో వీరంతా పార్టీలో చేరడం గమనార్హం. ఇటీవల శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేనా భవన్లో జరిగిన సమావేశంలో కూడా ఇరు పార్టీల నాయకులు ఇదే విషయంపై (శివసేన నుంచి బయటపడినవారిని బీజేపీలో, బీజేపీ నుంచి బయట పడిన వారిని శివసేనలోకి చేర్చుకోవద్దని) ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ధులే నియోజక వర్గంలో శివసేనకు చెందిన సుభాష్ భామ్రేను బీజేపీలో చేర్చుకుని ఆ ఒప్పందాన్ని కాలరాసింది. అప్పట్లో ఇరు పార్టీల నాయకుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముందుగా బీజేపీ అధిగమిస్తోందని శివసేన ఆరోపిస్తోంది. ఇప్పుడు బీజేపీ నుంచి బయటపడిన వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు మేమేందుకు వెనకడాలనే ప్రశ్నను శివసేన నాయకులు లేవనెత్తుతున్నారు.
రాజుకొంటున్న ‘ఇంటర్ ట్రేడింగ్’
Published Tue, Sep 2 2014 11:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement