పార్లమెంటు స్తంభనపై అడ్వాణీ మండిపాటు
స్పీకర్, మంత్రి సభను నడపలేకపోతున్నారన్న అడ్వాణీ
అధికార, విపక్షాలు రెండూ దొందూ దొందే
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా మూడోవారం కూడా స్తంభించటంపై బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎల్కే అడ్వాణీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సభలో కొందరు విపక్ష సభ్యులు.. అధికార ఎంపీల సీట్లవైపు వచ్చి వెల్లో నినాదాలు చేస్తుండటంతో ఆగ్రహంగా.. మంత్రి అనంత్ కుమార్పై రుసరుసలాడారు. ‘స్పీకర్ కానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గానీ సభను నడపలేకపోతున్నార’ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘లోక్సభ కార్యకలాపాలను స్పీకర్ నడపటం లేదు. ఈ విషయాన్ని ఆమెకే చెబుతాను. ఇదే విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తాను. ప్రస్తుత పరిస్థితికి అధికార, ప్రతిపక్షాలదే బాధ్యత’ అని నిప్పులు చెరిగారు. విపక్షాల ఆందోళన మధ్య సభ వాయిదా పడగానే.. ‘ఎంతసేపు వాయిదా’ అని లోక్సభ అధికారిని అడిగారు. ఆయన పదిహేను నిమిషాలని చెప్పగానే.. సభను ‘నిరవధిక వాయిదా వేయలేకపోయారా?’ అంటూ మౌనంగా వెళ్లిపోయారు. అడ్వాణీకి నచ్చజెప్పేందుకు అనంతకుమార్ యత్నించినా.. పెద్దాయన శాంతించలేదు. అనంతరం మీడియా గ్యాలరీ వైపు చూస్తూ.. ఈ వార్తను కవర్ చేయండనే సంకేతాలిచ్చారు.
అడ్వాణీ సూచనను పాటించండి: కాంగ్రెస్
పార్లమెంటు వ్యవహారాలను నిర్వహించటంలో అడ్వాణీ ఇచ్చిన సూచనను కేంద్రం పాటించాలని కాంగ్రెస్ సూచించింది. అడ్వాణీ సరైన కోణంలోనే అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్ అన్నారు. విపక్షాల మాటల్ని వినని బీజేపీ.. కనీసం తమ ‘మార్గదర్శకుడు’అడ్వాణీ సూచనలనైనా వినాలన్నారు. మరోరోజూ చర్చలేకుండానే..: నోట్లరద్దుపై ప్రతిష్టంభన కారణంగా పార్లమెంటు సమావేశాలు 14వ రోజూ చర్చ జరగకుండానే ముగిశాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు సభాకార్యక్రమాలను జరగనీయలేదు. ఉభయసభల్లోనూ ఇదే పరిస్థితి వాయిదాకు దారితీసింది.
నోట్లరద్దుపై ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం కారణంగా 84 మంది మృతిచెందారని, దీనికి బాధ్యత ఎవరిదని రాజ్యసభలో విపక్షనేత ఆజాద్ ప్రశ్నించారు. దీనిపై అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు. దీంతో సభ వాయిదా పడింది. కాగా, శనివారం నుంచి లోక్సభకు 4రోజులు సెలవులొచ్చాయి. శని, ఆదివారాలకు తోడు సోమవారం సెలవు ఇవ్వాలని పార్లమెంటు వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. మంగళవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెలవు ఉంది.
ఇలాగేనా సభ నడిపేది!
Published Thu, Dec 8 2016 3:57 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● సాయంత్రం నుంచి రథాలకు బ్రేక్.. మూగబోనున్న మైక్లు ● మద్యం దుకాణాలకూ సీల్ ● చివరిరోజుపై పార్టీల ఫోకస్
బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
No Headline
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
మోదీని మూడోసారి ప్రధాని చేయాలి
బీజేపీకి ఓటమి భయం
క్లుప్తంగా
గాలివాన బీభత్సం
కల్యాణం.. కమనీయం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement