పట్నాలో రేప‌టినుంచి లాక్‌డౌన్ | Sakshi
Sakshi News home page

పట్నాలో రేప‌టినుంచి లాక్‌డౌన్

Published Thu, Jul 9 2020 10:11 AM

Lockdown In Patna From July 10 to 16 Essential Services Allowed - Sakshi

పట్నా :  క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో బిహార్ రాజ‌ధాని పట్నాలో  లాక్‌డౌన్ విధింపున‌కు కార్య‌చ‌ర‌ణ సిద్ధమైంది. పట్నాలో ఈనెల 10 నుంచి 16 వ‌ర‌కు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు  జిల్లా మేజిస్ట్రేట్ ర‌వి కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ‌త కొన్ని రోజులుగా పట్నాలో క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా కార్యాల‌య‌, వాణిజ్య కార్య‌క‌లాపాల‌కు సైతం అనుమ‌తి లేద‌ని వెల్ల‌డించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 749 కొత్త క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోదుకాగా దీనిలో ఒక్క పట్నాలోనే 235 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 13,274 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు బిహార్‌ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. (రెమిడిసివిర్‌కు తీవ్ర కొరత )


 

Advertisement
Advertisement