అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు! | Sakshi
Sakshi News home page

అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు!

Published Mon, Feb 23 2015 6:57 PM

అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు!

తమిళనాడులో అభిమానం ఎప్పుడూ హద్దులు దాటుతూనే ఉంటుందంటారు. దానికి మరో ఉదాహరణ. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలంటూ ఆ పార్టీ మద్దతుదారు ఒకరు శిలువ వేసుకున్నారు. చుట్టూ కొంతమంది పార్టీ కార్యకర్తలు చూస్తుండగానే షిహాన్ హుస్సేని అనే వ్యక్తి ఇలా శిలువ వేసుకున్నాడు.

ఆరు అంగుళాల పొడవున్న మేకులను అతడి చేతులు, కాళ్లకు అతడి శిష్యులు కొట్టారు. షిహాన్ కరాటే మాస్టర్ అని సమాచారం. నొప్పిని తట్టుకుంటూ ఆ చెక్క శిలువకు అతడు ఆరు నిమిషాలకు పైగా ఉండిపోయాడు. అవినీతి కేసులో బెంగలూరు కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించడంతో గత సంవత్సరం జయలలిత తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Advertisement
Advertisement