స్నేహితుడి నుంచి రూ. 30 వేలు అప్పు తీసుకుని, దానికి బదులుగా తన భార్యను తాకట్టు పెట్టేశాడో పెద్దమనిషి. అయితే, ఆమెను విడిచిపెట్టాలంటే మరింత అదనపు సొమ్ము కావాలని స్నేహితుడు డిమాండ్ చేయడంతో.. అతడిని చంపేశాడు. మహ్మద్ గులామ్ (35) అనే వ్యక్తి శవం రెండు వారాల క్రితం పోలీసులకు దొరికింది. ఆ కేసును ఛేదించే క్రమంలో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. బిహార్లోని అరియా జిల్లాకు చెందిన గులామ్ గత రెండున్నరేళ్లుగా యమునానగర్లో ఉంటున్నాడు. జనవరిలోఅతడు తన స్నేహితుడు సబీర్ అలీకి రూ. 30వేలు అప్పుగా ఇచ్చాడు. అతడు కూడా బిహార్ నుంచి వలస వచ్చినవాడే. అతడు ఓ టిఫిన్ సెంటర్ నడుపుతూ కాంట్రాక్టర్లకు కూలీలను సరఫరా చేస్తుంటాడు. గులాం పత్తి ప్రాసెసింగ్ వ్యాపారం చేస్తుంటాడు. సబీర్ భార్య సల్మా చేతి వంట తింటూ ఉండేవాడు.
అయితే మొన్న జనవరిలో సబీర్ తన భార్య సల్మాను గులాం వద్ద తాకట్టు పెట్టి రూ. 30వేలు అప్పు తీసుకున్నాడు. దాంతో గులాం ఆమెను యమునానగర్ సమీపంలోని జగధారి నగరంలో గల తన ఇంటికి తీసుకెళ్లాడు. మార్చిలో సల్మా, గులాం కలిసి బిహార్ వెళ్లి, తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు తిరిగారు.
సెప్టెంబర్లో మళ్లీ పత్తి సీజన్ మొదలవడంతో ఇద్దరూ యమునానగర్ తిరిగొచ్చారు. వాళ్లిద్దరూ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా సహజీవనంలోనే ఉన్నారు. తర్వాత ఉన్నట్టుండి గులాం దారుణ హత్యకు గురై కనిపించాడు.
తాను రూ.30 వేలు చెల్లించినా, సల్మాను విడిచిపెట్టాలంటే మరో రూ. 20 వేలు వడ్డీగా ఇవ్వాల్సిందేనని గులాం చెప్పాడని, సరేనని ఆ మొత్తం కూడా ఇచ్చినా తన భార్యను వదల్లేదని.. దాంతో తాను, తన భార్య కలిసి గులాంను చంపేశామని సాబిర్ పోలీసులకు తెలిపాడు. ఈ హత్యలో వాళ్లకు మరికొందరు స్నేహితులు కూడా సహకరించారు. అందరినీ పోలీసులు అరెస్టు చేశారు.
రూ. 30 వేలకు భార్య తాకట్టు.. ఆపై స్నేహితుడి హత్య!
Published Tue, Nov 17 2015 9:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement