న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ప్రాంతంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వ్యక్తిగత కక్షలతో తల్లీ కొడుకులను హత్యచేసిన ఓ వ్యక్తి, ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అంజుదేవి, ఆమె కుమారుడు ప్రశాంత్ (16) లను ఆ కుటుంబానికి బాగా తెలిసిన శ్యామ్ సింగ్ (32) అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 4 గంటల సమయంలో శ్యామ్ నేరుగా వంటింట్లో చొరబడ్డాడు. తెలిసినవాడు కావడంతో అక్కడే చదువుకుంటున్న ప్రశాంత్ అభ్యంతరం చెప్పలేదు. వంటింట్లోంచి కత్తి తెచ్చుకుని హఠాత్తుగా ప్రశాంత్ పై దాడిచేశాడు. మెడపై ఏడుసార్లు పొడిచాడు. పొరుగువారితో మాట్లాడుతున్న తల్లి.. తన కొడుకు అరుపులు విని పరుగెత్తుకొచ్చింది. కానీ అప్పటికే ప్రశాంత్ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. ఆమె ఆ షాక్ లో ఉండగానే ఆమెపై కూడా దాడిచేసి 8 సార్లు పొట్టలో కత్తితో పొడిచాడు.
అనంతరం పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈలోపు తల్లీబిడ్డల ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇంటిముందు గుమిగూడారు. దీంతో అతను గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించాడు. ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోగా, అంజు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది.
అంజుదేవి భర్త రాంజీ చిరువ్యాపారి. ఈ దంపతుల కుమార్తె జైపూర్లో చదువుకుంటోంది. ఈ కుటుంబానికి శ్యామ్సింగ్ కుటుంబం బాగా సన్నిహితంగా మెలుగుతారు. ఇరు కుటుంబాలు బిహార్కు చెందినవారని పోలీసుల విచారలో తేలింది. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు ఇరువైపులా బంధువులను ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లనే ఈ హత్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసు ఉన్నతాధికారి దీపేంద్ర పాథక్ తెలిపారు.
తల్లీ కొడుకులను పొడిచి చంపేశాడు
Published Wed, Mar 16 2016 12:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement