15న దండకారణ్యం బంద్ | Sakshi
Sakshi News home page

15న దండకారణ్యం బంద్

Published Fri, Apr 8 2016 12:35 PM

Maoists call for 'Dandakaranya Bandh' on April 15

రాయ్పూర్: మావోయిస్టులు ఈ నెల ఏప్రిల్ 15న దండకారణ్యం బంద్ కు పిలుపునిచ్చారు. తమపై గగనతలంలో నుంచి చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ఈ బంద్ పిలుపు ఇచ్చినట్లు కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి.

ఇటీవల ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంపై భారత వైమానిక దళం కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ చర్యలు నిరసిస్తూ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఆ ప్రకటన పత్రాల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1న వైమానిక సిబ్బంది ఈ కాల్పులు జరిపింది.

Advertisement
Advertisement