* రూ. 20కే మటన్ కర్రీ.. భారీ సబ్సిడీతో ఎంపీలకు తిండి
* 60-150 శాతం రాయితీతో పసందైన వంటలు
* గత ఐదేళ్లలో రూ. 60.7 కోట్ల మేర సబ్సిడీలు
న్యూఢిల్లీ: మార్కెట్లో మటన్ కేజీ ధర రూ. 500 దాటింది. మసాలా దోసె రూ. 30-40 మధ్య ఉంది. కానీ మన ఎంపీలకు మాత్రం ఇవి పరమ కారుచవకగా అందుతున్నాయి. వారు పసందైన మటన్ కర్రీని రూ. 20కి, మసాలా దోశను రూ. 6కే లాగించేస్తున్నారు. ఇదంతా పార్లమెంట్ క్యాంటీన్ అందుకుంటున్న సబ్సిడీ మహిమ. ఎంపీలకు ఆహారాన్ని అందించే పార్లమెంటు క్యాంటీన్ గత ఐదేళ్లలో రూ.60.7 కోట్ల భారీ సబ్సిడీని అందుకుంది. 60 నుంచి 150 శాతం రాయితీతో ఇక్కడ ఆహార పదార్థాలను అందిస్తున్నారు. పూరీ సబ్జీ లాంటి పదార్థాలను 88 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఎంపీలకు ఆహారాన్ని ఎంత సబ్సిడీతో ఇస్తున్నారో తెలిపే జాబితా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వెల్లడైంది. ఫిష్ ప్రైడ్ చిప్స్ను 63 శాతం సబ్సిడీతో రూ.25కు, మటన్ క ట్లెట్ను 65 శాతం రాయితీతో రూ.18కి, ఆయిల్డ్ వెజిటబుల్స్ను 83 శాతం సబ్సిడీతో రూ.5కు, మటన్ కర్రీని 67 శాతం రాయితీతో రూ.20కి, మసాలా దోశను 75 శాతం సబ్సిడీతో రూ.6కు అందిస్తున్నట్లు వెల్లడైంది.
పచ్చి కూరగాయలను రూ.41.25తో కొంటుండగా, వండిన పదార్థాలను రూ.4కే ఎంపీలకు ఇస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ తెలిపారు. నాన్వెజ్ మీల్కు అవసరమైన పదార్థాల సేకరణకు రూ.99 అవుతుండగా, వండిన డిష్ను రూ.33కే ఇస్తున్నారన్నారు. పార్లమెంటులోని మొత్తం 5 క్యాంటీన్లు నోరూరించే 76 రకాల డిష్లను భారీ సబ్సిడీతో ఇస్తున్నాయన్నారు. సబ్సిడీ లేకుండా ఇస్తున్నది కేవలం రోటీ మాత్రమే. రోటీకి అవసరమైన సరుకులు 77పైసలకు వస్తోంటే రోటీని ఒక్క రూపాయికి విక్రయిస్తున్నారు. నార్తర్న్ రైల్వే నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్లు సరుకులను ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ భండార్, మదర్ డైరీ, డీఎంఎస్ తదితరాల నుంచి సేకరిస్తాయి. జీతం, ఇతర అలవెన్సులు కలిపి నెలకు రూ. 1.4 లక్షలకు పైగా అందుకుంటున్న ఎంపీలకు మార్కెట్ ధరకే ఆహారాన్ని విక్రయించి సబ్సిడీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.
రూ. 6కే మసాలా దోశ
Published Wed, Jun 24 2015 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement