చంపేస్తామని బెదిరించి గ్యాంగ్రేప్ | Sakshi
Sakshi News home page

చంపేస్తామని బెదిరించి గ్యాంగ్రేప్

Published Sat, Jan 23 2016 1:16 PM

చంపేస్తామని బెదిరించి గ్యాంగ్రేప్ - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్లో  14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఇంట్లో ఒంటరిగా ఉన్న  మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి  ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  కుత్సెరా  గ్రామంలో ఈ దారుణం చేసుకుంది.

తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు  యువకులు బలవంతంగా ఇంట్లోకి  చొరబడి దారుణానికి  పాల్పడ్డారు. జరిగిన సంఘటనను ఎవరికైనా చెబితే  చంపేస్తామని బెదిరించి అక్కడనుంచి పారిపోయారని  సీనియన్ పోలీస్ అధికారి శనివారం వెల్లడించారు.   సకీబ్, రకీబ్  లను నిందితులుగా గుర్తించామన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా  కేసు నమోదు చేశామన్నారు.  బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Advertisement
Advertisement