మిజోరంలో బాలికపై గ్యాంగ్ రేప్ | Sakshi
Sakshi News home page

మిజోరంలో బాలికపై గ్యాంగ్ రేప్

Published Tue, Aug 5 2014 2:20 AM

మిజోరంలో బాలికపై గ్యాంగ్ రేప్ - Sakshi

ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో దారుణం జరిగింది. లుంగ్లేయి జిల్లాలో ఓ బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో నలుగురు మైనర్లే అని పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి తన స్నేహితుడు, మరో ఏడుగురితో కలసి బాధితురాలు తన గ్రామం నుంచి లుంగ్లేయికి బయలుదేరింది.

అయితే బాలిక స్నేహితుడు పర్స్ మరచిపోవడంతో.. ఆమెను అక్కడే వదిలి గ్రామానికి వెనుదిరిగాడు. అతడు తిరిగి వచ్చేలోగా నలుగురు మైనర్లతో పాటు మరో ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 

Advertisement
Advertisement