ఉత్తరాఖండ్లో భూకంపం | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్లో భూకంపం

Published Thu, Apr 2 2015 10:09 AM

Moderate earthquake jolts Uttarakhand

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను భూప్రకంపనలు వణికించాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే, దీనివల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ చోటుచేసుకోలేదు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా గుర్తించారు. భూకంప కేంద్రం చమోలీ జిల్లాలో ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు కనుగొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement