'మోదీ సర్కారు క్షమాపణ చెప్పాలి' | Sakshi
Sakshi News home page

'మోదీ సర్కారు క్షమాపణ చెప్పాలి'

Published Wed, May 11 2016 2:58 PM

'మోదీ సర్కారు క్షమాపణ చెప్పాలి'

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ వ్యవహారం నుంచి మోదీ సర్కారు పాఠాలు నేర్చుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇలాంటి సాహసాలకు మళ్లీ పాల్పడరని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసేందుకు ప్రయత్నించబోరన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడంతో మోదీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement