గోరక్షణ పేరుతో మోదీ రాజకీయాలు | Sakshi
Sakshi News home page

గోరక్షణ పేరుతో మోదీ రాజకీయాలు

Published Thu, Sep 29 2016 12:56 AM

గోరక్షణ పేరుతో మోదీ రాజకీయాలు - Sakshi

షహనాజ్‌పూర్(యూపీ): గోవును ఎన్నికల ప్రచారంలో ఒక అంశంగా మార్చడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గోసంరక్షణ పేరుతో బీజేపీ, ఆరెస్సెస్‌లు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కిసాన్‌యాత్రలో భాగంగా పువాయాలో మంగళవారం నిర్వహించిన ఖాత్ సభలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా సరైన ఆదరణ లేక రోడ్లపై తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఆవులు మరణిస్తున్నాయని, వాటి సంరక్షణ కోసం ఏమీ చేయని ప్రధాని గోసంరక్షణ పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు.

Advertisement
Advertisement