'మోదీ పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోంది' | Sakshi
Sakshi News home page

'మోదీ పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోంది'

Published Wed, Jun 24 2015 7:44 PM

modi ruling remembering emergency days, says rayala subash

హైదరాబాద్ : ఎమర్జెన్సీని తలపించేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనను సాగిస్తున్న నేపథ్యంలో ఈ నెల 25 న ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు రాయల సుభాష్‌ చంద్రబోస్ తెలిపారు. దేశ ప్రజలపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత పాలన ఎమెర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, విదేశాల్లోని కార్పొరేట్ కంపెనీలకు మోదీ ప్రభుత్వం ఊడిగం చేసే ఆతృతలో అన్ని వర్గాల ప్రజలపై తన దాడిని తీవ్రం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో సంస్థాగత సాంప్రదాయాలన్నింటిని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement