రాహుల్‌ను కనిపెడితే రూ.లక్ష | Sakshi
Sakshi News home page

రాహుల్‌ను కనిపెడితే రూ.లక్ష

Published Fri, Jun 24 2016 1:34 AM

రాహుల్‌ను కనిపెడితే రూ.లక్ష

భోపాల్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎక్కడున్నాడో చూపెడితే లక్ష రూపాయల బహుమానం ఇస్తానంటూ మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి విజేందర్‌సింగ్ సిసోడియా ప్రకటించారు. మాటిమాటికీ రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లడంపై ఆ యనిలా వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘రాహుల్‌ను చూపినా సరే... ఆయన ఎక్కడున్నాడో చెప్పినా సరే... రూ.లక్ష బహుమానం’ అంటూ గురువారమిక్కడ వెల్లడించారు. ‘కొన్ని నెలల కిందట కూడా రాహుల్ విదేశాలకు వెళ్లారు. పునరుత్తేజంతో తిరిగొచ్చారని అప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పారు.

ఆ తరువాత థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌లు చుట్టొచ్చారు. మళ్లీ విదేశాలకు వెళ్లారంటే... ఇప్పుడు రాహుల్‌లో ఉత్తేజం స్థాయి తగ్గిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టున్నారు. ఆయన ఎక్కడికెళ్లారు?ఎవర్ని కలిశారు? శక్తినెలా పొందుతారు?’ అని సింగ్ ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement