కేంద్రం నిర్ణయంపై ముస్లిం మహిళల హర్షం | Sakshi
Sakshi News home page

కేంద్రం నిర్ణయంపై ముస్లిం మహిళల హర్షం

Published Sat, Oct 8 2016 10:30 AM

కేంద్రం నిర్ణయంపై ముస్లిం మహిళల హర్షం - Sakshi

ఆగ్రా: లింగ సమానత్వం, లౌకికత్వాల ప్రాతిపదికన ముస్లింలు పాటించే మూడుసార్ల తలాక్ విధానాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం సుప్రీకోర్టును కోరడం పట్ల దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా 'ట్రిపుల్ తాలక్' ఈ విధానానికి స్వస్తి పలకాలని వారు కోరుతున్నారు.

ముస్లిం మహిళా సోషల్ యాక్టివిస్ట్ మరియా ఆలం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం ట్రిపుల్ తలాక్ విధానాన్నే కాకుండా.. ముస్లిం పర్సనల్ లా బోర్డ్(పీఎల్‌బీ) ను కూడా రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. షరియాలో ఉన్న చిక్కులను వివరించేందుకు ఏర్పాటైన పీఎల్‌బీ పురుష పక్షపాతిగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఖురాన్ ప్రకారం ముస్లిం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉన్నాయన్నారు. షాజియా సిద్దిఖీ అనే మరో మహిళ మాట్లాడుతూ.. 'ట్రిపుల్ తలాక్ వివక్షతో కూడినది. దీనిని తొలగించాల్సిందే. మూడు పదాలతో వివాహానికి ముగింపు పలికి.. మహిళల జీవితాలను నాశనం చేసే హక్కు ఉండరాదు' అన్నారు. పలు ముస్లిం దేశాలు ఇప్పటికే ట్రిపుల్ తాలక్ విధానాన్ని రద్దు చేశాయని ఆమె గుర్తుచేశారు.
 

Advertisement
Advertisement