► పీఎస్ఎల్వీ సక్సెస్పై ప్రధాని హర్షం.. నావిక్గా నామకరణం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగంతో అందుబాటులోకి రానున్న కొత్త నావిగేషన్ వ్యవస్థకు ‘నావిక్’(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్)గా నామకరణం చేస్తూ జాతికి అంకితం చేశారు. దేశంలోని 125 కోట్ల మందికి అమూల్యమైన బహుమతి ఇచ్చారని, దేశ త్రివర్ణ పతాకాన్ని వినువీధిలో రెపరెపలాడించారంటూ ఇస్రో శాస్త్రవేత్తలను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రయోగాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి విజయవంతం చేశారని అభినందించారు. ఇస్రో ప్రయోగాల్లో ఇది చరిత్రాత్మకమైన ఘట్టమని అభివర్ణించారు.
గురువారం షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి వీక్షించారు. వాస్తవానికి ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకితం చేయడానికి ప్రధాని వస్తారని ప్రచారం జరిగింది. అయితే రావడం కుదరకపోవడంతో ఢిల్లీ నుంచే ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి మాట్లాడారు. ఉపగ్రహ ప్రయోగాలతో దేశవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయని పేర్కొన్నారు. మరో రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోందని, అందుకే ఈ నావిగేషన్ వ్యవస్థను జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు.
ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రమే వివిధ రకాల పేర్లతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా భారత్ ఆవిర్భవించిందని అన్నారు. నావిగేషన్ సిస్టం టెక్నాలజీని నేడు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారుల నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలట్లు, కెప్టెన్ల వరకు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఈ టెక్నాలజీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు జరిగినా వెంటనే గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు.
అమూల్యమైన బహుమతి
Published Fri, Apr 29 2016 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement