దౌత్య నీతి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పొరుగునున్న ప్రత్యర్థి దేశాలకు తన పనితీరుతో హెచ్చరికలు చేస్తున్నారు. పదే పదే భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ.. చిరాకు పెడుతున్న చైనాకు చెక్ పెట్టడానికి ఆయన సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. జపాన్ పర్యటనను ఆయన ఒకరోజు పొడిగించుకున్నారు. భారతదేశానికి జపాన్ అత్యంత సన్నిహిత దేశమని, చైనా కంటే అదే తమకు ముఖ్యమని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఆయన ఈనెల 31వ తేదీన బయల్దేరి టోక్యో వెళ్తారని ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించగా, 30వ తేదీనే బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. ఇది చైనాకు ఒకరకంగా దుర్వార్తే అవుతుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఆయన తిరిగి వస్తారు. ఇంతవరకు జపాన్లో ఇంతలా ఐదు రోజులు పర్యటించిన భారత ప్రధాని ఎవరూ లేరు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా మోడీకి జపాన్లో అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. వాళ్లందరికీ ఇది కొంత శుభవార్తే అవుతుంది. అయితే.. చైనాకు మాత్రం కొంత దుర్వార్త అవ్వక తప్పదు. ప్రత్యర్థి శిబిరానికి చెందిన జపాన్ పర్యటన విషయంలో భారత ప్రధాని అంత ఎక్కువ ఆసక్తి చూపించడం సహజంగానే చైనాకు చేదుమాత్రలా అనిపిస్తుంది. తమను కాదని జపాన్కు నరేంద్రమోడీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని చైనా ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలోనన్న దౌత్య నీతి విషయంలో మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఉన్నతాధికారులు కూడా మెచ్చుకుంటున్నారు.
చైనాకు నరేంద్రమోడీ హెచ్చరిక?
Published Mon, Aug 25 2014 2:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement