కాంగ్రెస్, ఎన్సీపీ పాలన అవినీతిమయం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, ఎన్సీపీ పాలన అవినీతిమయం

Published Sun, Oct 5 2014 6:58 PM

కాంగ్రెస్, ఎన్సీపీ పాలన అవినీతిమయం - Sakshi

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరపున ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోండియాలో జరిగిన ఎన్నికల సభలో మోడీ ప్రసంగించారు. మహారాష్ట్ర భాగ్యరేఖను మార్చే ఎన్నికలని అన్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీల పాలనలో మహారాష్ట్రలో అవినీతి రాజ్యమేలిందని మోడీ ఆరోపించారు. 60 ఏళ్లయినా గోండియా ఆదివాసీల జీవితాలు మారలేదని అన్నారు. బీజేపీ పాలనలోని చత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో గిరిజనులు అభివృద్ది చెందారని మోడీ చెప్పారు.
 

Advertisement
Advertisement