* కాశ్మీర్ అంశంపై మోడీ కఠిన వైఖరి అవలంబించాలనుకుంటున్నారు
* మేమూ సిద్ధంగానే ఉన్నాం.. ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం
* జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నారని.. అయితే, అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ శనివారం స్పష్టం చేశారు. ‘భారతదేశ ప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పుడు కఠినంగా, మొండిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీరీలమైన మేం అందుకు సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం.
మోడీ వచ్చాడు.. మాకిప్పుడు పరీక్షా కాలం.. కష్టమైన రోజులు. అయినా, దేవుడి దయతో ఈ పరీక్షలో పాస్ అవుతాం’ అన్నారు. మోడీకి మేమిచ్చే సందేశం ఒకటే.. మీరు సుపరిపాలన ఇస్తారు కావచ్చు.. కానీ కఠిన వైఖరి అవలంబించి ఒక ఉద్యమాన్ని అంతం చేయలేరు’ అని స్పష్టం చేశారు. హిందీ వార్తాచానల్ ఇండియా టీవీలో రజత్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాసిన్ మాలిక్ పాల్గొన్నారు. తమ వల్లనే భారత్, పాక్ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
అన్ని సంబంధిత వర్గాలు చర్చల్లో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామన్నారు. పాక్తో చర్చల సందర్భంగా శాంతిపూర్వక వాతావరణం ఏర్పడటం కోసం కాశ్మీర్ వేర్పాటువాద నేతలు పాకిస్థాన్ వెళ్లేందుకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్పేయి అనుమతించిన విషయాన్ని మాలిక్ గుర్తు చేశారు. భారత్, పాకిస్థాన్లు మాత్రమే కూర్చుని చర్చలు జరపడానికి కాశ్మీర్ అంశం అనేది సరిహద్దు సమస్య కాదని మాలిక్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించే ఏ చర్చల్లోనైనా కాశ్మీరీలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.
మిలిటెంట్ల వద్దకు వెళ్లాలని మన్మోహన్ కోరారు
పాకిస్థాన్లోని మిలిటెంట్లతో సంప్రదించాల్సిందిగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తనను కోరారని మాలిక్ చెప్పారు. పాక్తో శాంతి ప్రక్రియ ఫలప్రదమయ్యేందుకు అది తోడ్పడుతుందని మన్మోహన్ భావించారన్నారు. మన్మోహన్ సింగ్తో సమావేశమైనప్పుడు శాంతి చర్చల్లో తమనూ భాగస్వాము లను చేయాలని తాను కోరిన సందర్భంలో ఆయన పై విధంగా స్పందించారని ఆయన వివరించారు.
మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం!
Published Sun, Aug 24 2014 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement