అదీ ఆ దేశ ఆహ్వానంపైనే
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వ ఆహ్వానంతో నరేంద్రమోదీ ఆ దేశంలో కాలుమోపారు.. అక్కడి ఏడు రాష్ట్రాల్లో కలియదిరిగారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతబలంగా ఉండటానికి కారణాలను స్వయంగా విశ్లేషించుకున్నారు. అక్కడి స్పేస్ సెంటర్ను పరిశీలించి ఆ స్థాయి కి భారతదేశం ఎదగాలంటే ఎంత కాలం పడుతుందోనని మథనపడ్డారు. అగ్రరాజ్యాధిపతి ప్రయాణించే వి మానాన్ని నిశితంగా పరిశీలించారు.. యువకులతో మా ట్లాడారు. విద్యావిధానం, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజులు అక్కడే గడిపారు.
అయితే ఇది నేటి సంగతి కాదు... సరిగ్గా 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. గోద్రా పరిణామాల నేపథ్యంలో మోదీకి వీసా ఇవ్వటానికి నిరాకరించిన అగ్రరాజ్యం.. ఇప్పుడు అదే మోదీని ఆహ్వానించి మరీ రెడ్కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ఇంతలో ఎంత తేడా! మరో విశేషం ఏమిటంటే... వీసా నిరాకరణకు ముందే ఓసారి ఆ ప్రభుత్వం ఆహ్వానం మేరకు మోదీ అమెరికాకు అతిథిగా వెళ్లారు.
1994 జూలై... భారతదేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు ఒక అధ్యయన యాత్ర ప్రారంభించా రు. 41 రోజుల పర్యటన షెడ్యూల్ అది. ఫ్రాన్స్, అమెరికాల్లో సాగింది. అందులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా.. మిగతా ముగ్గురు బీజేపీ నాయకులు. ఆ బీజేపీ నేతల్లో నరేంద్ర మోదీతోపాటు ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఉండటం విశేషం. మూడో నేత ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్. వారు తొలు త ఫ్రాన్స్ పర్యటించిన అనంతరం ‘అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ (ఏసీవైపీఎల్)’ అధికారిక ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లారు. అది పూర్తిగా అమెరికా ప్రభుత్వ కార్యక్రమంగా సాగింది. అప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండగా, కిషన్రెడ్డి బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఢిల్లీలోని పార్టీ నివాసంలో వీరి గదులు కూడా పక్కపక్కనే ఉండేవి.
అప్పుడూ ఇదే దృష్టికోణం...
అప్పట్లో అమెరికా పర్యటనను మోదీ ఓ సరదా ట్రిప్పు గా పరిగణించలేదు. అసలు అమెరికా అగ్రరాజ్యంగా ఎదగటానికి కారణాలేమిటి..? భారత్ ఆ స్థానానికి రావాలంటే అనుసరించాల్సిన విధానాలేమిటి..? అన్న కోణంలో పరిశీలించడానికి ఆ పర్యటనను మోడీ విని యోగించుకున్నారు. ‘‘నేను, అనంతకుమార్ అక్కడి పరిస్థితిని పరిశీలిస్తూ ముందుకు సాగుతుంటే... మోదీ మాత్రం చాలా సీరియస్గా, ఏదో ఆలోచిస్తూ పర్యటనను సాగించారు. అక్కడి యువకులు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయనేతలను ఏవేవో విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన దేశం ఇలా ఎప్పుడు మారుతుందో? అని మాతో తరచూ అనే వారు..’’అని నాటి పర్యటన విశేషాలను కిషన్రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
గడ్డం తీసేయాలన్న అద్వానీ..
ఆ పర్యటనకు బయలుదేరేముందు నరేంద్ర మోదీకి, కిషన్రెడ్డికి గడ్డం ఉంది. వీరిని పర్యటనకు ఎంపిక చేసిన నాటి పార్టీ జాతీయాధ్యక్షుడు అద్వానీ ఇద్దరినీ పిలిచి గడ్డం తీసేసి నీట్గా తయారు కావాలని ఆదేశించారట. దీంతో పర్యటనకు బయలుదేరే రోజు ఇద్దరూ గడ్డం తీసేశారట. ఆ తర్వాత మళ్లీ మోదీ ఎప్పుడూ నీట్గా గడ్డం తీసేసుకున్న దాఖలాలు లేవని పార్టీ నేతలు చెబుతారు.
20 ఏళ్ల కిందే అమెరికా వెళ్లిన మోదీ
Published Fri, Sep 26 2014 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement