భారత్ చేరుకున్న నేపాల్ ఉప ప్రధాని | Sakshi
Sakshi News home page

భారత్ చేరుకున్న నేపాల్ ఉప ప్రధాని

Published Fri, Jun 10 2016 10:11 AM

Nepal deputy PM to land in Delhi today for three-day visit

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం నేపాల్ ఉప ప్రధాని కమల్ థాప శుక్రవారం భారత్ చేరుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలతో పాటు నేపాల్ రాజ్యాంగం, ఇరు దేశాల మధ్య అంతర్గత వ్యవహారాలపై చర్చించనున్నారు. అలాగే శనివారం సౌత్ ఏషియా యూనివర్శిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో కమల్ థాపతో పాటు సుష్మా స్వరాజ్ కూడా పాల్గొంటారు. థాప భారత్ పర్యటించడంలో ఇది నాలుగో సారి. గత ఏడాది అక్టోబర్లో ఆయన ఇక్కడకు విచ్చేశారు.

 

Advertisement
Advertisement