లక్నో: ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గురు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఇటీవల జరిపిన న్యాయ అధికారుల నియామకాలు వివాదాస్పదమవుతున్నాయి. మొత్తం 312 మంది అధికారులకుగాను 90 శాతం అధికారులను అగ్ర కులాల నుంచి ఎంపిక చేయడం, వారిలో దాదాపు సగం మందిని, అంటే 152 మందిని బ్రాహ్మణ కులం నుంచి ఎంపిక చేయడం పట్ల బలహీన వర్గాలవారు, ఇతర వెనుకబడిన వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 312 మంది న్యాయ అధికారల నియామకాల్లో 282 మంది అగ్రకులాలకు చెందిన బ్రాహ్మణలు, ఠాకూర్లు, భూమిహార్లు, కయస్థాలు, వైశ్యులు ఉన్నారు.
ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన కులస్థులైన ఠాకూర్లనే ఎక్కువగా ప్రభుత్వ పదవుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసారి బ్రాహ్మణులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాయబరేలిలో వెనకబడిన వర్గాలకు, బ్రాహ్మణులకు జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించిన సంఘటనను కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. భూముల విషయమై బీసీలకు, బ్రాహ్మణులకు గొడవ జరిగిన విషయం తెల్సిందే.
ప్రభుత్వ చీఫ్ స్టాండింగ్ కౌన్సిలర్లు, అదనపు చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, బ్రీఫ్ హోల్లర్స్ (సివిల్), బ్రీఫ్ హోల్డర్స్ (క్రిమినల్) అనే ఐదు విభాగాల్లోనూ బ్రాహ్మణులకే ఆధిత్యనాథ్ పెద్ద పీట వేశారు. నలుగురు చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్ నియామకాల్లో ముగ్గురిని, 25 మంది అదనపు చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్లో 13 మందిని, 103 స్టాండింగ్ కౌన్సిల్స్లో 58 మందిని, 66 మంది బ్రీఫ్ హోల్డర్లలలో (సివిల్స్) 36 మందిని 114 బ్రీఫ్ హోల్డర్లలో (క్రిమినల్) 42 మందిని బ్రాహ్మణ కులస్థులనే నియమించారు. ఇతర వెనకబడిన వర్గాల నుంచి కేవలం 16 మందిని తీసుకున్నారు. అంటే మొత్తం నియామకాల్లో 5 శాతం మించి వారికి ప్రాతినిధ్యం లభించలేదు.
యూపీ నియామకాల్లో సం‘కుల’ సమరం
Published Sat, Jul 15 2017 5:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement