నైతికతపై సివిల్స్‌లో కొత్త పరీక్ష | Sakshi
Sakshi News home page

నైతికతపై సివిల్స్‌లో కొత్త పరీక్ష

Published Wed, Aug 14 2013 1:41 AM

New exam in Civils on moral values

న్యూఢిల్లీ: పరిపాలనలో కీలకపాత్ర పోషించే ఉన్నతాధికారులకు నైతిక విలువలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మార్పులు చేసింది. ఈ ఏడాది కొత్తగా ‘నైతిక విలువలు, నిజాయితీ, అభిరుచి’ సిలబస్‌పై  250 మార్కులకు కొత్త పరీక్ష ప్రవేశపెట్టింది. అభ్యర్థుల సౌకర్యార్థం దీనికి సంబంధించిన నమూనా పేపర్‌ను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Advertisement
Advertisement