జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్ | Sakshi
Sakshi News home page

జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్

Published Sat, Nov 14 2015 12:54 PM

జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్

పట్నా: జేడీయూ శాసనసభ పక్ష నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన జేడీయూ ఎమ్మెల్యేలు శనివారం పట్నాలో సమావేశమై నితీశ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

ఈ రోజు మహాకూటమిలోని పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు సమావేశమవుతాయి. ఈ సమావేశంలో మహాకూటమి శాసనసభ పక్ష నేతగా నితీశ్ను ఎన్నుకుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement