న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, మ్యాగజీన్లలో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం ఆపేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ అన్ని పనులకు ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం అనవసరమని అభిప్రాయపడింది. అంతేకాకుండా దీనిద్వారా రైల్వేలు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్వర్వులను జారీచేసింది. వెబ్సైట్లో టెండర్ వివరాలు ఉంచిన తేదీనే టెండర్ పబ్లిషింగ్ చేసిన తేదీగా భావించాలని రైల్వే బోర్డు అందులో తెలిపింది. టెండర్లు తెరిచేందుకు తీసుకునే కనీస సమయం కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది.
పత్రికల్లో రైల్వే టెండర్ ప్రకటనలు బంద్
Published Fri, Aug 10 2018 3:01 AM
Related news
-
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
'ఋతధ్వజుడు మదాలసల గాథ'
ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది: ‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు. గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు. బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు. పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది. ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు. ‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల. ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల. ‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు. ‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది. ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు. ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: వద్దమ్మా.. తప్పూ! -
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు!
'ఉదయం పూట టీ త్రాగగానే దినపత్రిక తిరగేసిన అలవాటు, అది కూడా తెలుగు పత్రిక అయితేనే తృప్తి. లాప్టాప్ ముందుపెట్టి మీకు కావలసిన పత్రిక చదువుకొండి! అంటున్నారు అమెరికాలో పిల్లలు. నిజమే నెట్లో వార్తలు తెలుసుకోవడం చాలా సులభం అయిపోయింది. అయినాసరే పేపర్ను చదవడమంటే వాలుకుర్చీలో ఒరిగి భౌతికంగా పేజీలను తిప్పుతూ శ్రీమతి విసుక్కున్నా ఆ వార్తలను గురించి ఆమెతో ప్రస్తావించడంలో లభించే ఆనందమే వేరు. అమెరికాలో న్యూస్పేపర్ తెప్పించుకొని చదివేవారు రోజురోజుకు తగ్గిపోతున్నారట. అంతదాకా ఎందుకు ఇప్పుడు మన దేశంలోనే ఆ పరిస్థితి వస్తుంది. వర్క్ చేసుకుంటూనే నెట్లో తాజావార్తలు చూసేస్తున్నారు. టీవీ న్యూస్ ఉండనే ఉన్నాయి, ఎటుపోయినా కారులో రేడియోలు మొగుతూనే ఉంటాయి. అంతదానికి ప్రత్యేకంగా న్యూస్ పేపర్ తెప్పించుకోవడం దేనికి అనుకుంటున్నది కొత్త తరం.' అమెరికాలో పత్రికలవాళ్ళు అమ్మకుండా మిగిలిన న్యూస్ పేపర్లను పాలితిన్ కవర్లలో చుట్టి మరీ ఇండ్ల ముందు పడేస్తుంటారు. అలా ప్రచారం కోసం వస్తున్న పత్రికలు ఎప్పటికప్పుడు తీయకపోతే చెత్తకుప్పలా తయారవుతాయి సుమా! ఇండియాలోనైతే వాటిని పాత వేస్ట్ కిందా అమ్ముకొని సొమ్ము చేసుకునే అవకాశమైనా ఉండేది ఇంట్లో మన ఆడవాళ్లకు. యూఎస్లో పేపర్ రద్దీకి ఒక ప్రత్యేక బాక్స్ ఉంచుతారు. అందులో వేస్తే అవి రీ సైక్లింగ్కు వెళ్లి పోతాయి. అమెరికాలో న్యూస్ పేపర్ ఖరీదు మనదేశంతో పోల్చుకుంటే తక్కువే అనవచ్చు. 50 సెంట్లకు అంతకు మించిన పేజీల పత్రిక, ప్రకటనల బ్రోచుర్లు కలుపుకొని వస్తుంది. ఆదివారం పేపర్ పేజీలు లెక్కించడం కాదు తూచి చూడాల్సిందే. అడ్వర్టైజ్మెంట్ కల్చర్ అంతగా పెరిగిపోయింది ఆ దేశంలో. వ్యాపార ప్రకటనలు చదువరులకు చేరవేయడానికి న్యూస్ పేపర్ల వాళ్లకు కవర్లలాగా ఉపయోగపడుతున్నాయనిపిస్తుంది. పేపర్ బాయ్స్ కారులో బయలుదేరి ఇంటింటికి పేపర్లు వేస్తూ వెళ్తుంటే మనకది చూడముచ్చట, కానీ అక్కడి వాళ్లకు మామూలే. ఒక దినపత్రికలో వార్తలు కాకుండా స్పోర్ట్స్, హెల్త్, ట్రావెల్, ఫ్లేవర్ అంటూ బోలెడు సప్లమెంట్లు, పిల్లల కోసం, పెద్దల కోసం పేజీలకు పేజీలు కార్టూన్లు, సినిమాలు, దుస్తులు, ఫర్నిచర్ ప్రకటనలు, స్పెషల్ ఆఫర్లు ఎన్నో.. ప్రత్యేక ఆసక్తి ఉంటే తప్ప పేపర్ మొత్తం చదవడం మాత్రం అయ్యే పనికాదు. ఇక రియల్ ఎస్టేట్ వారి కలర్ ఫుల్ ప్రకటనల గురించి చెప్పాల్సిన పనిలేదు (ఈ కల్చర్ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేస్తుంది). అసలు వాళ్ళే అక్కడ దినపత్రికలను నడుపుతున్నారేమో అనిపిస్తుంది. అమెరికావారి పత్రికల్లో మనదేశం గురించిన వార్తలు ఎప్పుడో కాని కనబడవు. వాళ్ళ దృష్టంతా ఇస్లామిక్ దేశాల మీదనే, 9/11 దాడి తర్వాత వచ్చిన మార్పు ఇది. మన దినపత్రికల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, ప్రకటనలే ఎక్కువగా కనబడుతాయి, అమెరికా ఇందుకు భిన్నం అనిపిస్తుంది. అక్కడ దేశాధ్యక్షుడు కూడా ఎప్పుడో గానీ చిరునవ్వులు చిందిస్తూ పత్రికల్లో కనబడడు. వారి పత్రికల్లో స్థానిక సమస్యలకు, చదువులకు, కుటుంబ విషయాలకు, ఆరోగ్యానికి, రుచికరమైన ఆహార పానీయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఏమి తింటున్నామో అనే కాదు.., ఎలా తినాలో తెలిపే టేబుల్ మ్యానర్స్ కూడా వారికి ముఖ్యం. మరో విశేషం.. అమెరికా పత్రికల్లో ఎంగేజ్మెంట్లు, బర్త్డేలు, పట్టభద్రులకు అభినందనలు ఎక్కువ కనబడుతుంటాయి. ఆత్మీయులు చనిపోయినప్పుడు మొక్కుబడిగా ఫోటో వేసి నివాళులు అర్పించడం కాదు, సంక్షిప్తంగా గతించిన వారి జీవిత విశేషాలను పేర్కొనడం అక్కడి ఆనవాయితీ. క్లాసిఫైడ్స్ ప్రకటనల్లో ఎన్నెన్నో వింతలు పెంపుడు జంతువుల గురించి ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కపిల్ల తప్పిపోయిందని, పిల్లి మాయమైందని బెంగపెట్టుకొని వాటి రూపురేఖా విలాసాలు వర్ణిస్తూ ప్రకటనలు ఇస్తారు. దొరికినట్లయితే మరో ప్రకటన ద్వారా కృతజ్ఞతలు కూడా చెబుతారు. ఇక సేవల ప్రకటనలకు లెక్కే లేదు. అవసరమైన వారికి అందమైన వారిని పంపడం కూడా వారి దృష్టిలో సేవే, ఎవరి పిచ్చి వారికి ఆనందం. పత్రికల సర్క్యూలేషన్ విషయానికి వస్తే అమెరికాలో జాతీయ స్థాయిలో వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి ముందు వరుసలో ఉంటాయి. అయితే స్థానిక పత్రికల డిమాండ్ కూడా తక్కువేం లేదు, ప్రతి సిటీ పేరు మీద ఏదో పత్రిక ఉండనే ఉంటుంది. ముఖ్యమైన సెంటర్లలో, మాల్స్లలో వెండింగ్ మెషిన్ల ద్వారా పత్రికలు పొందవచ్చు, కాకపోతే మన వద్ద సరిపడా కాయిన్స్ ఉండాలి. చాలామంది ప్రకటనల కోసం వీకెండ్ పేపర్ లు కొంటుంటారు. మత, కమ్యూనిటీ పరమైన, విదేశీయుల పత్రికలకు కూడా అమెరికాలో కొరత లేదు. జర్నలిజం అమెరికాలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తి. ఎన్నెన్నో కుంభకోణాలను బయట పెట్టినవి వాళ్ళ పత్రికలు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పత్రికలది ప్రముఖ పాత్ర. 'విద్యార్థి దశలో నేను పాఠ్య పుస్తకాల కన్నా ఎక్కువగా చదివినవి పత్రికలే, గురువులకన్నా కూడా నన్ను ఎక్కువ ప్రభావితం చేసినవి పత్రికలు, సాహితీ పుస్తకాలే. ఇక్కడున్నా బయటి దేశాలకు వెళ్లినా సినిమాలు, షికార్ల కన్నా కూడా నా ప్రధాన కాలక్షేపం అవే. నేను ఎప్పుడైనా ఇంటినుండి బయటికి వెళ్తుంటే ‘జేబులో పర్సు పెట్టుకోవడం మరిచిపోయినా మా అయన పత్రికో పుస్తకమో పట్టుకోవడం మాత్రం మరిచి పోడని’ జోక్ చేసేది శ్రీమతి చంద్రభాగ!' — వేముల ప్రభాకర్ -
దిమ్మతిరిగే ఫొటోస్ వదిలిన హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్తోపాటు పశ్చిమ బెంగాల్లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
Related News by category
-
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిరంజన్ హిరేమఠ మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చిన అమిత్షాకు తన కుమార్తె నేహా హీరేమత్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష ఉండేలా చూడాలని, ఇలాంటి కేసులను 90 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నిరంజన్ హిరేమఠ విజ్ఞప్తితో నేహా మరణంపై తగిన న్యాయం చేస్తామని అమిత్ షా ఇచ్చినట్లు నేహా హిరేమఠ తండ్రి నిరంజన్ హిరేమఠ వెల్లడించారు -
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్: విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. -
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్ స్కాండల్ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.ప్రజ్వల్ లోక్సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. -
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ లాకప్లో ఉన్న నిందితుడు అనుజ్ థాపన్.. బుధవారం ఉదయం 11 గంటలకు లాకప్ గదిలో వాష్రూమ్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్కు చెందిన అనూజ్ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా గత నెల 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్ చందర్లను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ తపన్ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.అయితే అనుజ్తోపాటు మరో పదిమంది అదే లాకప్లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారులాకప్లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. -
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement