పోలవరం కేసులో నాట్ బిఫోర్ ప్రకటించిన జడ్జి | Sakshi
Sakshi News home page

పోలవరం కేసులో నాట్ బిఫోర్ ప్రకటించిన జడ్జి

Published Fri, May 22 2015 11:50 AM

పోలవరం కేసులో నాట్ బిఫోర్ ప్రకటించిన జడ్జి - Sakshi

న్యూఢిల్లీ : పోలవరం నిర్వాసితుల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో న్యాయమూర్తి ఉదయ్ లలిత్.. నాట్ బిఫోర్ ప్రకటించారు. జూన్ మొదటి వారంలో మరో జడ్డి ఎదుట ప్రస్తావించాలని ఉదయ్ లలిత్ సూచించారు. తదుపరి విచారణ వచ్చే నెల మొదటివారానికి వాయిదా పడింది. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించవద్దని, కొత్త భూ సేకరణ ప్రకరారం పరిహారం చెల్లించాలంటూ పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement