వివాదాలకు కేంద్రంగా పలువురు న్యాయమూర్తుల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశ న్యాయవ్యవస్థలో జస్టిస్ కర్ణన్ ఒక వివాదాస్పద అధ్యాయం.. జైలు శిక్ష ఎదుర్కొన్న తొలి న్యాయమూర్తిగా, అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో నిలిచిపోయారు. కర్ణనే కాకుండాగతంలోనూ పలువురు న్యాయమూర్తులు తమ తీర్పుల సందర్భంగా వివాదా స్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మహేశ్ చంద్ర శర్మ పదవీ విరమణకు ముందు ఈ ఏడాది మే 31న ఒక తీర్పు సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెమలి బ్రహ్మచారి కావడం వల్లే జాతీయపక్షిగా ప్రకటించారని, ఆవు కూడా అంతే పవిత్రమని అందువల్ల జాతీయ జంతువుగా చేయాలని కోరారు. ‘మగ నెమలి బ్రహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో శృంగారం జరపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంద’న్న వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి.
జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా: న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన సందర్భంగా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుధా మిశ్రా సుప్రీం వెబ్సైట్లో ఆస్తుల వివరాలు పేర్కొంటూ.. వివాహం కాని తన కుమార్తెల్ని అప్పుగా ప్రస్తావించారు.
జస్టిస్ భక్తవత్సల: 2012లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో వేధింపులకు పాల్పడుతున్న భర్త నుంచి విడాకులు కోరిన మహిళతో.. ‘పెళ్లి చేసుకుని అందరూ మహిళలు బాధలుపడుతున్నారు. నీకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. అంటే మహిళగా నీవు ఇబ్బంది పడుతున్నావని అర్థం. నీ భర్త మంచి వ్యాపారం చేస్తున్నాడు. అతను నీ బాగోగులు చూస్తాడు. అలాంటప్పుడు అతను కొడుతున్నాడనే విషయం గురించే ఎందుకు మాట్లాడుతున్నావ’ని పేర్కొన్నారు.
జస్టిస్ మార్కండేయ కట్జూ: పదవిలో ఉండగా ఒక తీర్పు సందర్భంగా ‘కొందరు అవినీతిపరుల్ని బహిరంగంగా ఉరితీస్తే.. మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటార’ని వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మరో కేసులో ‘ముస్లిం విద్యార్థుల్ని గడ్డం పెంచుకునేందుకు అనుమతిస్తే.. దేశం తాలిబన్ల ప్రాంతంగా తయారవుతుంద’ని పేర్కొన్నారు.
జస్టిస్ శ్రీవాత్సవ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ శ్రీవాత్సవ భగవద్గీతను జాతీయ ధర్మశాస్త్రంగా ప్రకటించాలని కోరడం విమర్శలకు దారితీసింది.
జస్టిస్ పి.దేవదాస్: 2015లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. అత్యాచారం కేసులో నేరస్తుడితో రాజీ చేసుకోమని బాధితురాలికి సూచించడం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. నేరస్తుడికి బెయిల్ మంజూరు చేయడంతో పాటు, అతన్ని పెళ్లి చేసుకోవాలని బాధితురాలికి జస్టిస్ దేవదాస్ సూచించారు.
జస్టిస్ జేబీ పర్దివాలా: గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ‘ఈ దేశాన్ని నాశనం చేస్తున్న రెండు అంశాలు ఏవంటే.. ఒకటి రిజర్వేషన్, రెండు అవినీత’ని పేర్కొనడం చర్చనీయాంశమైంది.
కర్ణన్తో పాటు మరికొందరు
Published Mon, Jun 19 2017 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement