కేంద్ర ఉద్యోగుల మూల వేతనం 2.57 రెట్లు పెంపు
న్యూఢిల్లీ : ఏడో వేతన సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల మూల వేతనాన్ని 2.57 రెట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం నోటిఫై చేసింది. దీనివల్ల కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. ఖజానాపై ఏటా సుమారు రూ. 1.02 లక్షల కోట్ల భారం పడనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ. ఏడు వేల నుంచి రూ. 18 వేలకు పెరిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఏడాదిలో జనవరి 1, జూలై 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు జూలై 1న మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తోంది.
వార్షిక ఇంక్రిమెంట్కు రెండు తేదీలు
ఇకపై ఉద్యోగులు అపాయింట్మెంట్ తేదీ, పదోన్నతి, పే స్కేలు మార్పులను బట్టి ఈ రెండు తేదీల్లో ఒక తేదీన వార్షిక ఇంక్రిమెంట్ పొందుతారని పేర్కొంది. అయితే అలవెన్సులకు సంబంధించిన సలహాలను మాత్రం ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలనకు పంపింది. 4 నెలల్లో ఈ కమిటీ దీనిపై నివేదిక సమర్పిస్తుంది. టెలికాం, బీమా, సెబీ లాంటి నియంత్రణ (రెగ్యులేటర్) కమిటీల చైర్పర్సన్లకు నెలకు రూ. 4.5 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ఈ కమిటీల సభ్యులు నెలకు రూ. 4 లక్షల ప్యాకేజీ పొందుతారు.
పనిచేస్తేనే వేతన పెంపు
ఆశించిన స్థాయిలో పనిచేయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు ఉండదని కేంద్రంతెలిపింది. పదోన్నతి, ఆర్థిక ప్రయోజనాల హెచ్చింపు కోసం ఉద్యోగుల పనితీరును మదింపు చేసే ప్రమాణాలను ‘గుడ్’ నుంచి ‘వెరీ గుడ్’కు పెంచారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ప్రకటన జారీ చేస్తూ ఆర్థిక శాఖ ఈమేరకు పేర్కొంది. ఉద్యోగ పదోన్నతి హామీ(ఎంఏసీపీ) పథకాన్ని ఇప్పటిలాగే 10, 20, 30 ఏళ్లకు అమలుచేస్తారు. తొలి 20 ఏళ్ల కెరీర్లో నిర్దేశిత ప్రమాణాలు అందుకోని ఉద్యోగుల వేతన పెంపుదలను నిలిపివేయాలన్న సంఘం సిఫార్సును కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు.
వేతన పెంపుపై నోటిఫికేషన్
Published Wed, Jul 27 2016 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement