అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

Published Sun, Sep 21 2014 2:13 AM

Notification to the Assembly elections

ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడింది. 288 మంది సభ్యులుండే అసెంబ్లీకి అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. వీటితోపాటు బీడ్ ఎంపీ సీటుకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయుని ఆయున చెప్పారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే వురణంతో ఈ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. శనివారం నుంచే ఎన్నికల ప్రక్రియు ప్రారంభమైందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.

►   ఈనెల 27వతేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.
►   అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు.
►   అక్టోబర్ 15వ తేదీన పోలింగ్
►  అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు

 కాగా వచ్చే నెల 15న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం జారీచేసింది.
 
 

Advertisement
Advertisement